గజ్వేల్‌లో ఎదురెదురుగా రెండు కార్లు ఢీ.. వ్యక్తి మృతి

గజ్వేల్‌లో ఎదురెదురుగా రెండు కార్లు ఢీ.. వ్యక్తి మృతి
  • మరో నలుగురికి తీవ్ర గాయాలు.. 

గజ్వేల్​, వెలుగు: ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గజ్వేల్​ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  గజ్వేల్​మండలం కొల్గూర్​గ్రామానికి చెందిన వెంకటేశ్​ తన కుమారుడి బర్త్‌ డే  కోసం బంధువులైన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం గొట్టి ముక్కుల గ్రామానికి చెందిన వెంకటేశ్​గౌడ్, అంబార్​పేటకు చెందిన సాయిగౌడ్, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన నానిలతో కలసి కేక్​ తేవటానికి కారులో గజ్వేల్​ పట్టణానికి బయలుదేరారు.  

తొగుట- గజ్వేల్​ రహదారిపై జాలిగామ ఎక్స్​రోడ్డు వద్దకు చేరుకునే సరికి ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నారు.  దీంతో కారులోని గొల్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్​గౌడ్​ స్పాట్​లోనే చనిపోయాడు.  తీవ్ర గాయాలపాలైన నలుగురిని 108 సిబ్బంది గజ్వేల్​ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.