రెండు కాలేజీ బస్సులు ఢీ..పది మందికి తీవ్రగాయాలు..భారీగా ట్రాఫిక్ జామ్

రెండు కాలేజీ బస్సులు ఢీ..పది మందికి తీవ్రగాయాలు..భారీగా ట్రాఫిక్ జామ్

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కాలేజీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఆనంద గార్డెన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రెండు బస్సుల డ్రైవర్లతో సహా పది మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. 

క్షతగాత్రులను నర్సాపూర్, సంగారెడ్డి,హైదరాబాద్ ఆస్పత్రిలోకి తరలించారు. ప్రమాదంతో నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఓ డ్రైవర్ కాలు బస్సులో ఇరుక్కుపోవడంతో బయటికి తీయడానికి స్థానికులు తీవ్రంగా శ్రమించారు. రెండు బస్సులు కూడా స్థానిక బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీకి చెందినవిగా గుర్తించారు. 

ALSO READ : పోక్సో కేసులో ఇండియాలోనే మొదటి మరణశిక్ష..