
యాదాద్రి, వెలుగు: టిప్పర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. ఆలేరు మండలం శ్రీనివాసపురంలోని ఎస్ఎన్ఇన్ఫ్రా క్రషర్మిల్లులో లోడింగ్ కోసం మంగళవారం టిప్పర్ వెళ్తుండగా.. అదుపు తప్పి లోతైన గోతిలో పడిపోయింది. డ్రైవర్ప్రహ్లాద్సింగ్, క్లీనర్ సందీప్సింగ్ స్పాట్లో చనిపోయారు. మరో వ్యక్తి లవకుశ సింగ్కు తీవ్ర గాయాలవడంతో హైదరాబాద్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆలేరు ఎస్ఐ రజనీకర్ తెలిపారు.