
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. టౌన్ సీఐ చంద్రశేఖర్రెడ్డి, సీసీఎస్ సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. మహారాష్ర్టలోని నాందేడ్ జిల్లా నర్సి టౌన్కు చెందిన షేక్ ఇమ్రాన్ ఇస్మాయిల్, షేక్ వాజిద్ సుమారు మూడు సంవత్సరాలుగా కామారెడ్డి టౌన్, దేవునిపల్లి ఏరియాల్లో 30 నుంచి 40 ఇండ్లల్లో చోరీకి పాల్పడ్డారు.
చోరీ చేసిన సొత్తును దెగ్లూర్ ఏరియాలో అమ్ముతున్నారు. మళ్లీ చోరీ చేసేందుకు శనివారం కామారెడ్డి టౌన్కు రాగా, వీరిని రైల్వే స్టేషన్ ఏరియాలో పట్టుకున్నామని తెలిపారు. కేసు దర్యాప్తులో కృషి చేసిన ఎస్సై ఉస్మాన్, సిబ్బంది సురేందర్, రవి, గణపతి, శ్రవణ్, రాజేందర్, కిషన్, టౌన్, రూరల్ సీఐలు, ఎస్సైలు ఉన్నారు.