శ్రీకాకుళంలో విషాదం.. తేనెటీగల దాడిలో ఇద్దరు మృతి..!

శ్రీకాకుళంలో విషాదం.. తేనెటీగల దాడిలో ఇద్దరు మృతి..!

శ్రీకాకుళం: తేనెటీగల దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‎లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం..శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం లంకపేటలో శుక్రవారం (సెప్టెంబర్ 20) సాయంత్రం గ్రామస్థులపై ఒక్కసారిగా తేనేటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

ఇందులో ఇద్దరు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందగా.. మిగిలిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హెల్త్ కండిషన్ సీరియస్‎గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‎కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతులను కిల్లారి కాంతమ్మ, కిల్లరి సూరి కిష్టప్పడుగా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.