రెండు లారీలు ఢీ.. క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్లు

రెండు లారీలు ఢీ.. క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్లు

ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  జాతీయ రహదారి 163 పై ఎదురెదురుగా అతివేగంతో  వస్తున్న రెండు లారీలు ఢీ కొన్నాయి.   ఈ ఘటనలో  క్యాబిన్ లో ఇరుక్కున్న ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు. స్థానికులు వాళ్లను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.  

ఈ ప్రమాదంలో  రెండు లారీలు నుజ్జనుజ్జ అయ్యాయి. ప్రమాదంతో రోడ్డుపై కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.