ఇద్దరు యువకులు మిస్సింగ్​

ఇద్దరు యువకులు మిస్సింగ్​

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్ బీ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఇద్దరు యువకులు మిస్సయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్​మండలంలోని బాటసింగారానికి చెందిన ఏర్పుల వంశీకృష్ణ, శాలిని దంపతులు. వంశీకృష్ణ అన్న రాధాకృష్ణ స్వగ్రామంలో ఇల్లు నిర్మిస్తున్నాడు. 

లోన్ కు సంబంధించిన ఈఎంఐలు కట్టే విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వంశీకృష్ణ నెల రోజులుగా తన భార్యతో కలిసి, కేపీహెచ్​బీ అడ్డగుట్ట సొసైటీలోని మాదినేని కో–లివింగ్ ​పీజీ హాస్టల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. రాధాకృష్ణ తరచూ అతనికి ఫోన్​చేస్తూ ఈఎంఐ కట్టాలని వత్తిడి చేస్తున్నాడు. 

గురువారం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తున్నానని భార్యకు చెప్పి వెళ్లిన వంశీకృష్ణ తిరిగి రాలేదు. సాయంత్రం 6.30 గంటలకు ఆమెకు వాట్సాప్​ మెసేజ్​చేశాడు. తన అన్న ఈఎంఐ కోసం చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక పోతున్నానని, ఎటైనా వెళ్లి, చనిపోవాలనుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. శాలిని శుక్రవారం కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మనీ​ కోసం బెంగళూరు వెళ్తున్నానని మరొకరు..

కేపీహెచ్​బీ పోలీస్​స్టేషన్​ పరిధిలోనే మరో యువకుడు మిస్సయ్యాడు. ఏపీలోని బాపట్ల జిల్లా గొల్లపూడికి చెందిన గంద ఉదయభాస్కర్​కొంతకాలంగా కేపీహెచ్​బీ కాలనీ మలేషియా టౌన్​షిప్​లో ఫ్రెండ్స్​తో కలిసి ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 16న తన బావ సురేశ్​బాబుకు ఫోన్​ చేసి, మనీ కోసం బెంగళూరు వెళ్తున్నానని, రెండు రోజుల్లో వస్తానని చెప్పాడు. ఆ తర్వాత కాంటాక్ట్​లో లేకపోవటంతో సురేశ్​బాబు నగరానికి వచ్చాడు. ఉదయ్​భాస్కర్​ రూమ్​మేట్స్​ను వాకబు చేస్తే 10 రోజుల నుంచి తమతోనూ కాంటాక్ట్​లో లేడని చెప్పారు. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.