చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్​లో పిడుగుపాటుకు మరో ఇద్దరు జవాన్లు మృతి

చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్​లో  పిడుగుపాటుకు మరో ఇద్దరు జవాన్లు మృతి
  • చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్​లో రెండు రోజుల్లో ముగ్గురు దుర్మరణం

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా బార్సూర్ పోలీస్​స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పిడుగుపాటుకు 111 సీఆర్​పీఎఫ్​ బెటాలియన్​కు చెందిన ఇద్దరు జవాన్లు చనిపోయారు. మావోయిస్టుల ఏరివేతకు ఏర్పాటు చేసిన సీఆర్​పీఎఫ్​ బేస్​ క్యాంపులో ఉన్న ఉత్తరప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్ కు చెందిన మహేంద్రకుమార్, జార్ఖండ్​ రాష్ట్రంలోని సాహీబగంజ్​కు చెందిన సాహూఅట్ ఆలం అనే జవాన్లపై పిడుగు పడింది. 

పిడుగుపాటుకు గురైన వీరిద్దరినీ దంతెవాడ జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. గురువారం కూడా బీజాపూర్ బస్తర్​ బెటాలియన్​కు చెందిన కమలేశ్​ హేమ్లా అనే జవాన్​ పిడుగు పడి చనిపోయిన సంగతి విదితమే.