
తిరుమల: తిరుమల ఘాట్రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో అసోంకు చెందిన ఇద్దరు తిరుమల కొండలను వీడియో తీశారు. మొదటి ఘాట్రోడ్డులోని మోకాళ్ల పర్వతం వద్ద వారి వ్యక్తిగత డ్రోన్తో చిత్రీకరిస్తుండగా.. ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
భద్రతా కారణాల దృష్ట్యా తిరుమలలో ఎటువంటి డ్రోన్లు ఉపయోగించేందుకు అనుమతి లేదు. వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ అధికారులు అసోం వాసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.