
అయిజ, వెలుగు: మండలంలోని కుట్కనూరు గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న కర్నాటక మద్యం పట్టుకొని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు గద్వాల ఎక్సైజ్ సీఐ గణపతిరెడ్డి తెలిపారు. కర్నూల్ జిల్లా కనకవీడుపేట గ్రామానికి చెందిన రాముడు, మల్లేశ్ తరలిస్తున్న 25.92 లీటర్ల మద్యం, బైక్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని చెప్పారు. ఎక్సైజ్ ఎస్ఐలు వెంకటేశ్, నాగరాజు, కానిస్టేబుళ్లు మహేశ్, వేణు, శేఖర్, రాజు పాల్గొన్నారు.