
గోదావరిఖని, వెలుగు : సింగరేణి పరిధిలోని ఆర్జీ –1 ఏరియాలోని రెండు గనుల్లో ప్రమాదాలు జరిగి ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. జీడీకే–1 సీహెచ్పీలో వెల్డర్నారదాసు సిద్ద రామయ్య మంగళవారం బొగ్గు నింపే బంకర్వద్ద వెల్డింగ్చేశారు. అనంతరం దానిని ఆన్చేయడంతో కుడిచేయి దిమ్మె కింద పడి మూడు వేళ్లు తెగిపోయాయి. వెంటనే అతడిని గోదావరిఖనిలోని సింగరేణి హాస్పిటల్కు, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. అదేవిధంగా జీడీకే– 11 గనిలో జనరల్మజ్దూర్ కార్మికుడు టి.సతీశ్ పని స్థలంలో రూప్బోల్ట్తాకడంతో కుడి చేయికి గాయమైంది. వెంటనే సింగరేణి హాస్పిటల్కు తరలించగా ట్రీట్మెంట్అందిస్తున్నారు.