
జమ్మూకాశ్మీర్ లో మరోసారి టెర్రరిస్టులు రెచ్చిపోయారు. బుధవారం (ఏప్రిల్ 23) బారాముల్లాలోని ఉరి సెక్టార్ దగ్గర నియంత్రణ రేఖను దాటి భారత్ లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. ఉగ్రవాదులనుంచి భారీస్థాయిలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
OP TIKKA, Baramulla
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) April 23, 2025
On 23 Apr 2025, approximately 2-3 UI terrorists tried to infiltrate through general area Sarjeevan at Uri Nala, Baramulla, the alert tps on LC challenged and intercepted them resulting in a firefight.
Operation is in progress.#Kashmir@adgpi… pic.twitter.com/FOTXiTNYSf
మంగళవారం పహల్గామ్ లో టెర్రరిస్టుల దాడి తర్వాత ఈ ఆపరేషన్ జరిగింది. బారాముల్లాలోని ఉరి నాలా దగ్గర సర్జీవన్ జనరల్ ఏరియా ద్వారా ముగ్గురు ఉగ్రవాదులు భారత్ తో చొరబడేందుకు ప్రయత్నించారు వారిని ఆర్మీ ఎన్ కౌంటర్ చేసింది. బారాముల్లా ఆపరేషన్ కొనసాగుతుందని భద్రతాదళాలు తెలిపారు.