పట్టాలు తప్పిన మరో రైలు.. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ లో ఘటన

పట్టాలు తప్పిన మరో రైలు.. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ లో ఘటన

రైల్వే భద్రత, మౌలిక సదుపాయాల నిర్వహణలో ఉన్న సవాళ్లను ఎత్తిచూపుతూ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ  నేపథ్యంలో తాజాగా మరో రైలు పట్టాలు తప్పింది. శుక్రవారం ఒడిశాలోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్ కు సమీపంలో గూడ్స్ రైలులోని రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన ఉదయం 8.30 గంటల ప్రాంతంలో జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. 

కాగా ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏం జరగలేదని.. ఎవరికి గాయాలు కూడా కాలేదని అధికారులు తెలిపారు. ఇతర రైళ్ల ప్రయాణానికి కూడా ఎలాంటి ఆటంకాలు లేవని స్పష్టం చేశారు. ప్రమాదానికి గురైన రైల్వే ట్రాక్ ను సహాయక బృందాలు పునరుద్ధరిస్తున్నయని అధికారులు వెల్లడించారు.