మేడ్చల్ పారిశ్రామిక వాడలో 11కెవీ వైర్లు తెగిపడి ఘోర ప్రమాదం

మేడ్చల్ పారిశ్రామిక వాడలో 11కెవీ వైర్లు తెగిపడి ఘోర ప్రమాదం

మేడ్చల్ పారిశ్రామిక వాడలోని మూతపడిన కంపెనీ హిందుస్తాన్ యూనివర్ లిమిటెడ్ లో విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు చనిపోయారు. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీ మేడ్చల్ పారిశ్రామిక వాడు నుంచి ఇటీవల శంషాబాద్ కు మార్చారు. ఈ రోజు (అక్టోబర్7)న ఆ కంపెనీ ఆవరణలో ఇనుప నిచ్చెనను తమ బ్యారక్‌కు మార్చుతుండగా.. 11 కెవీ హై టెన్షన్ వైరు తెగి కార్మికులపై పడింది. 

ఈ ప్రమాదంలోఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అందులో  2 ఇద్దరు మృతి చెందారు. మృతులు గుడు బైటా(26), పురో మాంఝీ (25) బీహార్ కు చెందిన వారు. మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ సిఐ సత్యనారాయణ తెలిపారు.

ALSO READ | బొగ్గుగనిలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి