హైదరాబాద్‌లో ఇద్దరు యువతుల ఆత్మహత్య

హైదరాబాద్‌లో ఇద్దరు యువతుల ఆత్మహత్య

 

గండిపేట్, వెలుగు: నార్సింగి పీఎస్​ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అంజలిరాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాస్, సబితారాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్మాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(22) దంపతులు. వీరు తమ నాలుగేండ్ల బాబుతో నార్సింగిలో ఉంటున్నారు. అంజలిరాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురువారం పనికి వెళ్లాడు. మధ్యాహ్నం భార్యకు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా లిఫ్ట్​ చేయలేదు. ఇంటికి వచ్చి చూడగా తలుపులు గడియ పెట్టి ఉన్నాయి. స్థానికుల సహాయంతో పగులగొట్టి చూడగా.. సబితారాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉరేసుకొని కనిపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు
 పేర్కొన్నారు. 

అమీర్​పేట్ లో..

పంజాగుట్ట, వెలుగు: ఎస్సార్ నగర్ లో కూడా ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని నంద్యాల జిల్లా అయ్యలూరుకు చెందిన పెరుమాళ్ల శశికళ(24 ) రెండేండ్ల  క్రితం నగరానికి వచ్చింది. అమీర్​పేట్​లో ఓ అద్దె ఇంట్లో ఉంటూ కూకట్ పల్లి స్మాల్ ​ఫైనాన్స్ ​బ్యాంకులో  అసిస్టెంట్​అక్విజేషన్​ మేనేజర్​గా పని చేస్తోంది.  ఆమెతో మధురానగర్​లోని మరో స్మాల్​ఫైనాన్స్ బ్యాంకులో పని చేస్తున్న రమాదేవి ఉంటోంది.

రమాదేవి గురువారం ఉదయం బ్యాంకుకు వెళ్లిపోగా, శశికళ గదిలోనే ఉంది. ఆమె స్నేహితుడు రమాదేవికి ఫోన్​చేసి, శశికళ బాధపడుతూ తనకు  ఫోన్ ​చేసిందని, ఒకసారి రూమ్​కు వెళ్లి చూడాలని కోరాడు. రమాదేవి వెళ్లి, తలుపు తెరిచి చూడగా.. శశికళ ఫ్యాన్​కు ఉరేసుకొని కనిపించింది.  ప్రేమ విఫలమై, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందని ఎస్ఐ రాజు తెలిపారు.