
జోగిపేట, వెలుగు : మెదక్ జిల్లా అందోల్ మండలం బ్రహ్మణపల్లి చౌరస్తా వద్ద శనివారం ఆటో బైక్ ఢీకొని ఇద్దరు యువకులు చనిపోయారు. జోగిపేట ఎస్ఐ సామ్య నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. అందోల్ కు చెందిన గాండ్ల రాములు (29), డాకూర్ గ్రామానికి చెందిన చింతకి నాగరాజు (24) బైక్పై తాలెల్మలోని ఓ ఫంక్షన్కు వెళ్లి జోగిపేట వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. దీంతో రాములు, నాగరాజు అక్కడికక్కడే చనిపోయారు. ఆటో డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.