ఫిలిప్పీన్స్​లో ‘ట్రామీ’ విధ్వంసం.. 100 మంది మృతి

ఫిలిప్పీన్స్​లో ‘ట్రామీ’ విధ్వంసం.. 100 మంది మృతి
  • 36 మంది గల్లంతు

మనీలా: ఫిలిప్పీన్స్​లో ట్రామీ తుఫాన్​ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. వందలాది ఇండ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఆదివారం నాటికి మృతి చెందిన వారి సంఖ్య దాదాపుగా100కు చేరుకుంది. మరో 36 మంది గల్లంతయ్యారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని చెప్పారు. తుఫానుతో బికోల్ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. ఇక్కడ 38 మంది చనిపోయారని పోలీసులు పేర్కొన్నారు. వరదల్లో మునిగిపోవడంతో ఎక్కువ 
మంది మృతి చెందారని వివరించారు.