ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 11వ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..యు ముంబా బోణీ

ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 11వ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..యు ముంబా బోణీ

హైదరాబాద్, వెలుగు :  ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 11వ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యు ముంబా బోణీ చేసింది. బుధవారం  రాత్రి గచ్చిబౌలి ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబా 33–27 తేడాతో గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. అమిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మొహమ్మద్ జఫర్దనేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (10 పాయింట్లు) సూపర్ టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నాడు.  గుజరాత్ తరఫున  పర్తీక్ దహియా, సొంబీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరో ఐదు పాయింట్లతో  రాణించినా ఫలితం లేకపోయింది.  

మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమిళ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తలైవాస్ 35–30  తేడాతో పుణెరి పల్టాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి వరుసగా రెండో విజయం సాధించింది.  నరేందర్ కండోలా  9, సచిన్  8 పాయింట్లతో  సత్తా చాటి తలైవాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిపించారు.. పుణెరి జట్టులో రైడర్ మోహిత్ గోయత్ (13) ఒంటరి పోరాటం చేశాడు. గురువారం జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారియర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో యూపీ యోధాస్, హర్యానా స్టీలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జైపూర్ పింక్ పాంథర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  తలపడతాయి.