వీఆర్ఎస్ తీసుకున్న.. ఖానాపూర్​ ఎమ్మెల్యే భర్త ​

వీఆర్ఎస్ తీసుకున్న.. ఖానాపూర్​ ఎమ్మెల్యే భర్త ​
  • ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం 

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  నిర్మల్​ జిల్లా ఖానాపూర్​ బీఆర్ఎస్​ ఎమ్మెల్యే రేఖా​నాయక్​ భర్త, ఉద్యోగ సంఘ నాయకుడు ఎమ్​వీఐ అజ్మీరా శ్యామ్​నాయక్​ వీఆర్ఎస్​ తీసుకుంటున్నట్లు చెప్పారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో సంఘం నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 

Also Read :  మంత్రి ఇంటి పట్టా ఇచ్చినా.. హోంగార్డు కబ్జా చేస్తుండు

ఈ నెల30న తన వీఆర్ఎస్​ దరఖాస్తు ఆమోదం పొందనుందని తెలిపారు.  ప్రజలు కోరితే రాజకీయాల్లోకి వస్తానన్నారు. ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సమావేశంలో టీఎన్జీఓ నాయకులు నవీన్, తదితరులు పాల్గొన్నారు.