త్వరలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది అవార్డులు

త్వరలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది అవార్డులు

ఖైరతాబాద్, వెలుగు: ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ఇవ్వనున్నట్టు తెలంగాణ  telugu జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వరావు, తెలుగు జర్నలిస్టుల సంక్షేమం సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు తెలిపారు. శుక్రవారం ప్రెస్​క్లబ్​లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.

 ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ‘ఉగాది పురస్కారాలు–2024’ అందజేయనున్నట్లు చెప్పారు.  వివిధ పత్రికలు, టీవీ చానల్స్ లోని ఉత్తమ రిపోర్టర్లు, యాంకర్లను ఎంపిక చేస్తున్నామన్నారు. రెండు రాష్ట్రాల సంయుక్త ఆధ్వర్యంలో త్వరలో రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్​ రెడ్డి, సుప్రీంకోర్టు రిటైర్డ్​జస్టిస్​ఎన్వీ రమణ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ పాల్గొన్నారు.