
ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. మందమర్రి, రామకృష్ణాపూర్ , ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల పట్టణాల్లోని ప్రధాన ఆలయాల్లో పురోహితులు పంచాంగం చెప్పారు. మందమర్రి ఏరియాలోని కేకే5, ఏరియా వర్క్షాపు, ఆర్కేపీ సీహెచ్పీ, ఆర్కేపీ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు ఉగాది పచ్చడి పంపిణి చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల కల్యాణం జరిగింది. ఆదిలాబాద్లో రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉగాది వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు. - వెలుగు, నెట్వర్క్