న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు తేవాలని, శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాలన్న భారత్ ప్రతిపాదనకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా మద్దతు తెలిపారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్ జీఏ) 79వ సెషన్ సమావేశాల సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్ కూడా భారత్కు మద్దతు తెలిపారు. ప్రపంచ వేదికపై కీలక స్థానంలో ఉన్న భారత్కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.
యూఎన్ జీఏలో గురువారం బ్రిటన్ ప్రధాని స్టార్మర్ మాట్లాడారు. ‘‘భద్రతా మండలి మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం ఉన్న సంస్థగా మారాలి. రాజకీయాల కారణంగా ఈ సంస్థ స్తంభించిపోకూడదని కోరుకుంటున్నా. భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీలతో సహా ఆఫ్రికన్ కౌన్సిల్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. అలాగే భద్రతా మండలిలో విడతలవారీగా ఎన్నుకునే సభ్యుల సంఖ్యనూ పెంచాలని కోరుకుంటున్నాం” అని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు.