కేబుల్స్​బిజినెస్​లోకి అల్ట్రాటెక్..1800కోట్ల పెట్టుబడులు

కేబుల్స్​బిజినెస్​లోకి అల్ట్రాటెక్..1800కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ:సిమెంటు తయారీ కంపెనీ అల్ట్రాటెక్.. వైర్లు, కేబుల్స్​బిజినెస్​లోకి ప్రవేశిస్తున్నది. ఇందుకోసం రాబోయే రెండేళ్లలో రూ.1,800 కోట్లు ఖర్చు చేస్తామని తెలి పింది. వచ్చే ఏడాది డిసెంబరు నుంచి కార్యకలాపాలు మొదలవుతాయి. గుజరాత్​లోని భరూచ్​లో ప్లాంటు నిర్మిస్తారు. 

కన్​స్ట్రక్షన్​​బిజినెస్​లో తమ స్థానాన్ని మెరుగు పర్చుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆదిత్య బిర్లా గ్రూప్​ చైర్మన్​ కుమార్​మంగళమ్​ బిర్లా చెప్పారు. మనదేశంలో వైర్లు, కేబుల్స్​ బిజినెస్​ 2019 నుంచి 2024 మధ్య ఏటా 13 శాతం వృద్ధిని సాధించింది.