అంబులెన్సుకు దారిలేక.. కావడే దిక్కు

అంబులెన్సుకు దారిలేక.. కావడే దిక్కు

  బూర్గంపహాడ్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్​ మండలంలోని సారపాక పరిధిలోని శ్రీరాంపురం గిరిజన గ్రామానికి చెందిన మహిళ నర్సమ్మ మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. సోమవారం ఆరోగ్యం విషమించింది. మరోవైపు భారీ వర్షాలతో రోడ్డంగా బురదగా మారడంతో గ్రామంలోకి అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కుటుంబీకులు ఆమెను కావడిపై మోసుకొంటూ 3 కిలోమీటర్లు నడిచి, ప్రధాన రహదారి వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న బూర్గంపహాడ్ ఎస్​ఐ రాజేశ్​ మెయిన్​ రోడ్డు వద్ద అంబులెన్సును ఏర్పాటు చేయించి, భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.