
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలో పర్మిషన్లేకుండా నిర్మించిన ఫుడ్ కోర్టును శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కూల్చివేశారు. డీఎల్ఎఫ్బిల్డింగ్సమీపంలో కొంత కాలంగా ఏఎం అండ్పీఎం పేరుతో ఫుడ్కోర్టు నిర్వహిస్తున్నారు. అయితే అది అక్రమ నిర్మాణం అని పలువురు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఫుడ్కోర్టు బిల్డింగ్ను కూల్చివేయాలని కోరారు.
విచారణలో అక్రమ నిర్మాణం అని తేలడంతో కూల్చివేతకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో శనివారం ఉదయం రెండు జేసీబీలతో ఏఎం అండ్ పీఎం ఫుడ్ కోర్టును నేలమట్టం చేశారు. పోలీసులు బందోబస్తు కల్పించారు.