జేఎన్టీయూలో 26న చక్రవ్యూహ్ నాటకం : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామికి పిలుపు

జేఎన్టీయూలో 26న చక్రవ్యూహ్ నాటకం : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామికి పిలుపు

కూకట్​పల్లి, వెలుగు: హరిద్వార్​కు చెందిన దివ్య ప్రేమ్​సేవా మిషన్​న్యాస్​సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 26న కూకట్​పల్లి జేఎన్టీయూ క్యాంపస్​లో ‘చక్రవ్యూహ్’ పేరుతో నాటకం వేస్తున్నారు. సంస్థ నిర్వాహకులు సోమవారం సిటీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామిని కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివేక్​మాట్లాడుతూ హరిద్వార్​కేంద్రంగా లెప్రసీ పేషెంట్స్ కు చికిత్స, వారి పిల్లలకు ఉచిత విద్య కల్పిస్తున్న ప్రేమ్​ సేవా మిషన్ సేవలు అభినందనీయమన్నారు. 

సేవా సంస్థపై అవగాహన కల్పించడానికి సిటీలో ఏర్పాటు చేస్తున్న నాటకాన్ని సక్సెస్​చేయాలని పిలుపునిచ్చారు. 28 ఏండ్లుగా హరిద్వార్​లో లెప్రసీ పేషెంట్స్ కు చికిత్స, దాదాపు 600 మంది చిన్నారులకు ఉచిత విద్య అందిస్తున్నామని, గంగా నది ప్రక్షాళన, ప్లాంటేషన్​, పారా మెడికల్ విభాగాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 26న సాయంత్రం 4 గంటలకు జేఎన్టీయూలో చక్రవ్యూహ్ నాటకం మొదలవుతుందని, మహాభారత్​ సీరియల్​లో శ్రీకృష్ణుడిగా నటించిన నితీశ్​​భరద్వాజ్​శ్రీకృష్ణుడి పాత్ర పోషించనున్నారని తెలిపారు.