ముంబై: దేశంలోనే మొదటి అండర్ గ్రౌండ్ మెట్రో కారిడార్ ముంబైవాసులకు అందుబాటులోకి వచ్చింది. శనివారం ఈ మెట్రో కారిడార్ను ప్రధాని మోదీ ప్రారంభించగా, సోమవారం ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ) నుంచి అరై వరకు 12.69 కిలోమీటర్లు ఈ అండర్ గ్రౌండ్ మెట్రోను నిర్మించారు. మొదటి రోజు ఇందులో ప్రయాణించేందుకు ముంబై ప్రజలు ఆసక్తి కనబర్చారు. అయితే, కొన్నిసార్లు ట్రైన్ డోర్లు మూసుకోవడం, తెరుచుకోవడంలో ఇబ్బందులు తలెత్తున్నాయని పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.