
రామడుగు, వెలుగు: రామడుగు మండలం వెలిచాల గ్రామాన్ని యునిసెఫ్ బృందం సందర్శించింది. గ్రామంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాను, స్కూల్లో ఏర్పాటుచేసిన విటమిన్ గార్డెన్ ను, స్టూడెంట్స్ హ్యాండ్ వాష్ పద్ధతిని పరిశీలించారు. గ్రామంలోని అంగన్వాడీలో చిన్నారులకు అన్నప్రాశన చేశారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్తో యునిసెఫ్ ప్రతినిధులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యునిసెఫ్ సహకారంతో కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నామన్నారు. జిల్లాలో చేపడుతున్న స్వచ్ఛతా ప్రోగ్రామ్స్ను యునిసెఫ్ టీం ప్రశంసించినట్లు వెల్లడించారు. యునిసెఫ్ ప్రతినిధులు పౌలేజి వర్క్ నే, మనీష్ వసూజ, వెంకటేశ్, ప్రభాత్, ఫణీంద్ర, అధికారులు పాల్గొన్నారు.