
కేంద్రబడ్జెట్ 2025-26 ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఇన్ కమ్ ట్యాక్స్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రూ 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు ఇచ్చింది.
ఎన్డీయే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. కుంభమేళా తొక్కిసలాట ఘటనపై విపక్షాలు చర్చకు పట్టుబడుతూ లోక్ సభలో విపక్షాలు వాకౌట్ చేశాయి. విపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగించారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా 8వ సారి కావడం గమనార్హం. అత్యధిక సార్లు మోరార్జీ దేశాయ్ పది సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం తొమ్మిది సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు.ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 8 సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టి ప్రణబ్ ముఖర్జీ(8 సార్లు) రికార్డ్ ను సమం చేశారు.
- బడ్జెట్ పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బడ్జెట్ రైలుకు అనేక ఇంజిన్లు ఉన్నాయి..ఇవి కాస్త పట్టాలు తప్పాయని సీనియర్ నేత జై రాం రమేశ్ విమర్శించారు. ఎన్డీయేకు పిల్లర్ లాంటి ఏపీని విస్మరించారు. త్వరలో ఎన్నికలు ఉండటంతో బీహార్ కు భారీగా కేటాయించారు.
- లోక్ సభ ఫిబ్రవరి 3 కు వాయిదా
- నిర్మలాసీ తారామన్ బడ్జెట్ ప్రసంగం గంటా 15 నిముషాలు
- మధ్యతరగతి ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్
- బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాల ఊసెత్తని కేంద్రం
- ఏపీ పోలవరం నిర్మాణ వ్యయాన్ని సవరిస్తున్నట్లు చెప్పిన కేంద్రం
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
బడ్జెట్ లో కీలక కేటాయింపులు
- రక్షణ రంగం (Defence): రూ. 4.91 లక్షల కోట్లు
- గ్రామీణాభివృద్ధి (Rural Development): రూ. 2.66 లక్షల కోట్లు
- హోమ్ శాఖ (Home Affairs): రూ. 2.33 లక్షల కోట్లు
- వ్యవసాయ రంగం (Agriculture & Allied Activities): రూ. 1.71 లక్షల కోట్లు
- విద్య (Education): రూ. 1.28 లక్షల కోట్లు
- వైద్యం (Health): రూ. 98,311 కోట్లు
- పట్టణాభివృద్ధి (Urban Development): రూ. 96,777 కోట్లు
- ఐటీ, టెలికాం (IT & Telecom): రూ. 95,298 కోట్లు
- విద్యుత్ (Energy): రూ. 81,174 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్యం (Commerce & Industry): రూ. 65,553 కోట్లు
- సామాజిక సంక్షేమం (Social Welfare): రూ. 60,052 కోట్లు
- శాస్త్ర సాంకేతిక అభివృద్ధి: రూ. 55,679 కోట్లు
తొలిసారి రూ. 50 లక్షల కోట్లు దాటిన కేంద్ర బడ్జెట్
- 2025-26 మొత్తం బడ్జెట్ రూ. 50,65,345 కోట్లు
- రెవెన్యూ వసూళ్లు రూ. 34,20,409 కోట్లు
- మూల ధన వసూళ్లు రూ. 16,44,936 కోట్లు
- అప్పులు,ఇతర వసూళ్లు రూ. 15,68,936
- GDPలో ఆర్థిక లోటు 4.8 శాతం
- ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం రూ.42. 70 లక్షల కోట్లు
- రాష్ట్రాల ద్వారా కేంద్రానికి నికర పన్ను వసూళ్లు రూ. 28.37 లక్షల కోట్లు
- పన్నుయేతర ఆదాయం రూ. 5.83 లక్షల కోట్లు
- 2025-26 ద్రవ్య లోటు 4.4 శాతంగా అంచనా
ఇన్ కమ్ ట్యాక్స్ కొత్త స్లాబ్ లు
రూ. 0-4 లక్షలు వరకు జీరో
రూ. 4-8 లక్షలు- 5%
రూ. 8-12 లక్షలు - 10%
రూ. 12-16- లక్షలు- 15%
రూ 16-20- లక్షలు- 20%
రూ. 20-24 లక్షలు- 25%
రూ. 24 లక్షల పైన- 30%
- తగ్గనున్న క్యాన్సర్ తీవ్రమైన వ్యాధుల ఔషధాలకు పన్ను మినహాయింపు
- తగ్గనున్న లెదర్ ఉత్పత్తుల ధరలు
- తగ్గనున్న సముద్ర ఉత్పత్తుల ధరలు
- భారతీయ న్యాయ సంహిత చట్టం తరహాలో ఐటీ చట్టం
- మద్య తరగతిని దృష్టిలో ఉంచుకుని ఆదాయ పన్ను
- టీడీఎస్,టీసీఎస్ రేట్ల తగ్గింపు
- సీనియర్ సిటిజన్లకు టీడీఎస్,టీసీఎస్ మినహాయింపు మొత్తం రూ.లక్షకు
- మరింత సరళతరంగా కొత్త ఆదాయ పన్ను చట్టం
- నిబంధనలు పదాలు దాదాపు 50శాతం తగ్గింపు
- 7రకాల కస్టమ్స్ సుంకాల తొలగింపు..
- క్యాన్సర్ బల్క్ డ్రగ్ తయారీకి పన్ను మినహాయింపు
- క్యాన్సర్ ,తీవ్రమైన వ్యాధుల మెడిసిన్స్ కు పన్ను మినహాయింపు
- తగ్గనున్న క్యాన్సర్, అరుదైన మెడిసిన్స్ ధరలు
- వచ్చే వారం కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ బిల్లు
- బీమా రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి
- మెడికల్ టూరిజానికి వచ్చే వారికి వీసా మంజూరులో మినహాయింపులు
- ప్రైవేట్ రంగం తోడ్పాటుతో మెడికల్ టూరిజం
- దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రి
- ఐఐటీల్లో 6 వేల 500 సీట్లు పెంపు
- మెడికల్ టూరిజానికి వచ్చే వారికి వీసా మంజూరులో మినహాయింపులు
- ప్రైవేట్ రంగం తోడ్పాటుతో మెడికల్ టూరిజం
- ఏఐ అధ్యయనం కోసం రూ.500 కోట్లతో అధ్యయన కేంద్రాల (Centres of Excellence in AI ) ఏర్పాటు.
- కొత్తగా 117 ప్రాంతాలకు విమాన సర్వీసులు
- వికసిత్ భారత్ కోసం న్యూ క్లియర్ ఎనర్జీ మిషన్
- రాష్ట్రాల కోసం లక్షన్నర కోట్ల రుణాలు
- సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు
- 2028 వరకు జల్ జీవన్ మిషన్ పథకం పొడిగింపు
- అణుశక్తి సవరణలు, ప్రైవేట్ రంగానికి అవకాశం
- గడిచిన పదేళ్లలో లక్షకు పైగా మెడికల్ సీట్లు పెంపు
- రానున్న ఐదేళ్లలో కొత్తగా 75 వేల మెడికల్ సీట్లు
- అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు
- 2025-26లో 200 క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు
- కోటి మంది గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా
- బీహార్ లో నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
- అస్సాంలో యూరియా యూనిట్ ఏర్పాటు
- చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానం
- మా ఫస్ట్ ఇంజిన్ వ్యవసాయం
- మేకిన్ ఇండియా కోసం ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు
- అంగన్ వాడీ కేంద్రాలకు ప్రత్యేక హంగులు
- ప్రభుత్వం పెట్టుబడులు పెంపు
- ప్రభుత్వ స్కూల్లలో 50 వేల అటల టింకర్ ల్యాబ్స్
- భారతీయ పుస్తకాలకు డిజిటల్ రూపం
- అన్ని ప్రభుత్వ హైస్కూల్స్ కు బ్రాడ్ బ్యాండ్ సేవలుస్టార్టప్ లో కోసం రూ. 20 కోట్ల వరకు లోన్
- పోస్టల్ రంగానికి కొత్త జనసత్వాలు
- 27 కీలక రంగాలకు ప్రాధాన్యత
- కార్మికులలు అధికంగా పనిచేసే సంస్థలకు చేయూత
- లాజిస్టిక్ వ్యవస్థగా ఇండియన్ పోస్ట్
- సూక్ష సంస్థలకు ప్రత్యేక క్రెడిట్ కార్డులు
- కిసాన్ క్రెడిట్ కార్డుల లిమిట్ రూ.3లక్షల నుంచి 5లక్షలకు పెంపు
- బీహార్ లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్టు
- పప్పు ధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాలిక
ప్రయోగాత్మకంగా 100 జిల్లాలలో పీఎం ధన్ ధాన్య యోజన పథకం - రైతుల కోసం పీఎం ధన్ ధాన్య యోజన పథకం
- ధన్ ధాన్య యోజన కింద 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి
- విక్షిత్ భారత్.. జీరో పావర్టీ లక్ష్యం
- మిడిల్ క్లాస్, ఇన్ ఫ్రా ప్రాధాన్యం
- యూత్, ఫార్మర్స్, మహిళలు టాప్ ప్రయారిటీ
- 1.7 కోట్ల రైతులకు లబ్ది కలిగేలా స్కీమ్స్
- వ్యవసాయ ఉత్పత్తి పెంచడమే లక్ష్యం
- కేంద్రం తీరుకు నిరసనగా విపక్షాలు వాకౌట్
- విపక్షాలు లేకుండా బడ్జెట్ ప్రసంగిస్తున్న నిర్మల
- విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టిన నిర్మలా సీతారామన్
- లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నిర్మలాసీతారామన్
-
వార్షిక బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం..కాసేపట్లో లోక్ సభలో ప్రవేశపెట్టనున్న నిర్మలాసీతారామన్
-
ప్రారంభమైన కేంద్ర కేబినెట్..బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్
-
రాష్ట్రపతితో భేటీ అనంతరం పార్లమెంట్ కు చేరుకున్న నిర్మలా సీతారామన్
-
ఎన్ఎస్ఈ నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 23,528 వద్ద కొనసాగుతోంది
సెన్సెక్స్ 136 పాయింట్లు పెరిగి 77,637కు చేరుకుంది
- కాసేపట్లో బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నిర్మలాసీతారామన్ భేటీ
- కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం 2025-26లో ఇండియన్ ఎకానమీ 6.3 నుంచి 6.8 శాతం వృద్ధి రేటుతో పెరగనున్నట్లు అంచనా