పసుపు బోర్డుకు ఫండ్స్ ఇయ్యల

పసుపు బోర్డుకు ఫండ్స్ ఇయ్యల
  • ఉమ్మడి జిల్లా ప్రజలను నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్ 
  •  డబుల్ ​రైల్వే లైన్​,  కొత్త ట్రైన్ల ఊసెత్తని కేంద్ర​ం..  
  •  జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టుకు నయాపైసా ఇవ్వని కేంద్రం
  • ఉమ్మడి జిల్లా నుంచి 8 మంది బీజేపీ ఎంపీలున్నా శూన్యం

నిజామాబాద్, వెలుగు: కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీయే సర్కారు ఈ ఏడాది బడ్జెట్​ కేటాయింపుల్లో ఇందూరు జిల్లాకు పూర్తిగా మొండి చేయి చూపింది. చాలా కాలంగా ఉన్న డిమాండ్లకు నిధులు కేటాయిస్తారని జిల్లా ప్రజలు గంపెడాశలతో ఉండగా ఆ ఊసే కనిపించలేదు.  కీలకమైన  అంశాల ప్రస్తావన తీసుకురాలేదు. సాధారణ పథకాలు మినహా డెవలప్​మెంట్​పనులకు నిధుల విషయంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలపై కేంద్రం చిన్నచూపు చూపిందని ఆయా పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  

  • పసుపు బోర్డు సహా

గతేడాది అక్టోబర్ 3న ప్రధాని మోదీ నిజామాబాద్ గడ్డపై పసుపు బోర్టు ఏర్పాటు ప్రకటన చేశారు. ఇటీవల పార్లమెంట్​ ఎన్నికల ప్రచార  టైంలో హోంమంత్రి అమిత్​షా మరోసారి బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సుమారు 35 వేల ఎకరాలలో రైతులు పసుపు సాగు చేస్తున్నారు.  బోర్డు ఏర్పాటులో పసుపు రైతులకు మేలు జరగడమే కాకుండా అనుబంధ పరిశ్రమల స్థాపనతో యూత్​కు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కేంద్ర బడ్జెట్​లో బోర్డుకు ఎలాంటి ఫండ్స్ కేటాయించలేదు. నిజామాబాద్​ను స్మార్ట్​ సిటీగా ఎక్కడా అనౌన్స్ చేయలేదు. 

  • రైల్వే పై చిన్న చూపు

నిజామాబాద్​ మీదుగా నిత్యం 42  రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. సింగిల్​ లైన్​పై నడుస్తున్నాయి. హైదరాబాద్​ నుంచి ముద్కెడ్​ డబుల్​ రైల్వే లైన్​ ప్రతిపాదనలు చాలా కాలంగా ఉన్నాయి. బోధన్–​-బీదర్​, బోధన్​-లాతూర్‌‌ కొత్త లైన్ కు బడ్జెట్ లో ఎలాంటి నిధులు ఇవ్వలేదు.  వందే భారత్​ రైలు మార్గం పొడిగింపు, రాయలసీమ ఎక్స్​ప్రెస్​ను బోధన్ ​వరకు పొడిగించాలన్న ప్రతిపాదన ఊసేత్తలేదు. నిజామాబాద్​ రైల్వే స్టేషన్​ మోడరైజేషన్, నందిపేట్​ సెజ్​ ప్రస్తావన లేదు.  నవీపేటలో ఆర్వోబీ నిర్మాణ అవసరాన్ని బడ్జెట్​లో గుర్తించలేదు. 

  • జక్రాన్​పల్లి ఎయిర్​పోర్టు తేలలే

 జక్రాన్​పల్లిలో ఎయిర్ పోర్టు  నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.  ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి పార్లమెంట్​లో లేవనెత్తిన జోరో అవర్​ ప్రశ్నకు స్టేట్​లో కొత్తగూడెం, మహబూబ్​నగర్​తో పాటు జక్రాన్​పల్లిలో గ్రీన్​ఫీల్డ్​ఎయిర్​పోర్టుల నిర్మాణానికి రెడీగా ఉన్నట్లు ఆన్సర్​ లభించింది. బడ్జెట్ లో వీటికి సంబంధించి నయాపైసా ఇవ్వలేదు. 

  • ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే చిన్నచూపా..

కామారెడ్డి​​ ​, వెలుగు: పార్లమెంట్​లో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జేట్​పై కామారెడ్డి జిల్లాకు చెందిన పలువురు పెదవి విరిచారు.  కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు దక్కింది శూన్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ విమర్శించారు. ఆంధ్ర, బిహార్ కు ప్రకటించిన దాంట్లో 25 శాతం కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు.  బడ్జెట్‌లో  తెలంగాణ ప్రస్తావన లేకపోవటం శోచనీయమన్నారు.  స్టేట్​ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే  కేంద్రం మాత్రం చిన్నచూపు 
చూసిందన్నారు. 

  • వికసిత్​ భారత్​లో విద్యా రంగానికి ప్రయార్టీ లేదా..?

వికసిత్​ భారత్​లో విద్యా రంగానికి ప్రయార్టీ లేదని ఏపీటీఎఫ్​ మాజీ స్టేట్ ప్రెసిడెంట్​ కె. వేణుగోపాల్  విమర్శించారు.  బడ్జెట్​లో విద్యా రంగానికి కేవలం 2.59 శాతం మాత్రమే కేటాయించారని ఇది ఏ మాత్రం సరిపోదన్నారు. కనీసం 6 శాతం కేటాయించాల్సిన అవసరముండేదన్నారు.   అరకొర కేటాయింపులతో వికసిత్​ భారత్ ఎలా సాధ్యమవుతుందన్నారు. అంకెల గారడితో  పన్ను భారం పెంచుతూ వేతన జీవులను మోసం చేస్తున్నారని  టీపీటీఎఫ్​ స్టేట్​ మాజీ ప్రెసిడెంట్​ కె.రమణ పేర్కొన్నారు.   

  • ఎంతో ఆశించాం

ప్రధాని మోదీ ద్వారా రాష్ట్రానికి ముఖ్యంగా నిజామాబాద్​ జిల్లాకు చాలా నిధులు ఆశించామని ఇంత నిరాశపరుస్తారని  అసలు ఊహాంచలేదని డీసీసీ ప్రెసిడెంట్​ మానాల మోహన్​రెడ్డి అన్నారు. పార్లమెంట్​ఎన్నికల్లో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా నిధులు సాధించడంలో ఫెయిల్​ అయ్యారన్నారు. నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ మాటలు ఉత్తవే అయ్యాయన్నారు.  కేంద్ర నుంచి స్టేట్​కు మోసం జరిగిందని ఇంతటి చిన్నచూపు ఎప్పుడూ లేదన్నారు.


‌‌ - మానాల మోహన్​రెడ్డి,  నిజామాబాద్ డీసీసీ ప్రెసిడెంట్​​