‘పృథ్వీ’ పథకానికి రూ.4 వేల కోట్లు.. ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

‘పృథ్వీ’ పథకానికి రూ.4 వేల కోట్లు.. ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

న్యూఢిల్లీ : ఎర్త్ సైన్సెస్​కు సంబంధించిన ‘పృథ్వి విజ్ఞాన్’ కార్యక్రమానికి రూ.4,797 కోట్లు కేటాయింపులకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది.  ప్రస్తుతం కొనసాగుతున్న ఐదు సబ్​ స్కీములను కలుపుతూ ఎర్త్ సైన్సెస్ శాఖ ‘పృథ్వి విజ్ఞాన్’ కార్యక్రమాన్ని కేంద్రానికి ప్రతిపాదించింది. నిధుల కేటాయింపునకు విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనపై శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్​భేటీలో చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎర్త్ సైన్సెస్ ప్రతిపాదనకు కేబినెట్ ఓకే  చెప్పింది. ఈ కార్యక్రమం కింద ‘‘వాతావరణం, వాతావరణ పరిశోధన-మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్’, ‘ఓషన్ సర్వీసెస్, మోడలింగ్ అప్లికేషన్, రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ’, ‘పోలార్ సైన్స్ అండ్ క్రయోస్పియర్ రీసెర్చ్’, ‘సిస్మాలజీ అండ్ జియో సైన్సెస్’,‘రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్​అండ్​ ఔట్రీచ్”అనే ఐదు స్కీమ్​లు నడుస్తున్నాయి. ‘పృథ్వీ విజ్ఞాన్’  ద్వారా జరిగే పరిశోధనలు వాతావరణం, సముద్రం, ధ్రువాలు, క్రియోస్పియర్, భూకంపాలు తదితర అంశాల్లో సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడతాయని ఎర్త్ సైన్సెస్ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

మారిషస్​తో కలిసి చిన్న శాటిలైట్ తయారీ

వచ్చే ఏడాది(2025) ప్రారంభంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయోగించనున్న చిన్న ఉపగ్రహాన్ని ఇండియా, మారిషస్‌ కలిసి డెవలప్ చేయనున్నాయని కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ఈ ఉమ్మడి శాటిలైట్ తయారీ అంచనా వ్యయం రూ.20 కోట్లను ఇండియా ఇండియా భరిస్తుంది. గతేడాది నవంబర్​లో మారిషస్​ మంత్రి వి.మురళీధరన్‌ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

గయానాతో ఒప్పందం..

క్రూడాయిల్​ కొనుగోలు, హైడ్రోకార్బన్ రంగం లో సహకారం కోసం గయానాతో ఐదేండ్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ‘గయానా నుంచి క్రూడాయిల్​దిగుమతి, చమురు కోసం గయానా చేసే అన్వేషణ,​​ ప్రొడక్షన్​(ఈఅండ్​పీ) డిపార్ట్​మెంట్​లో ఇండియా కంపెనీలు పాల్గొనడం, ముడి చమురు శుద్ధి రంగాలలో సహకారం” ఈ ఒప్పందంలో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.