ఆ మూడు పార్టీలే రాష్ట్రాన్ని నాశనం చేసినయ్: కేంద్రమంత్రి అమిత్ షా

ఆ మూడు పార్టీలే రాష్ట్రాన్ని నాశనం చేసినయ్: కేంద్రమంత్రి అమిత్ షా

శ్రీనగర్: గతంలో జమ్ముకాశ్మీర్‎ను పాలించిన ఆ మూడు పార్టీలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని, ఎన్నికల్లో ప్రజలు వారికి ఎండ్ కార్డ్ వేస్తారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా మేంధర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. అబ్దుల్లా, ముఫ్తీ, నెహ్రూ- గాంధీ కుటుంబాలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యన్ని కనుమరుగుచేశాయని మండిపడ్డారు. 

ఒకవేళ 2014లో మోదీ ప్రధాని కాకపోయి ఉంటే పంచాయతీ, బ్లాక్, జిల్లా స్థాయి ఎన్నికలు జరగకపోయి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. 1947 లో జరిగిన అనేక పోరాటాల్లో దేశ సైనికులు ఇక్కడి నుంచే పాకిస్తాన్ ఉగ్రవాదులతో ధైర్యంగా  పోరాడారని అన్నారు. ఎందరో పహది, గుర్జర్, బకర్ వాల్ సోదరులు సరిహద్దుల్లో బుల్లెట్లు ఎదురునిలిచారని తెలిపారు. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జమ్ముకాశ్మీర్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుందన్నారు.