
న్యూఢిల్లీ: ఇండియా సొంతగా వెబ్బ్రౌజర్డెవలప్ చేస్తోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్గురువారం ఢిల్లీలో ప్రకటించారు. ఇది డేటాను సురక్షితంగా ఉంచుతుందని, గోప్యతకు ఇబ్బందులు రానివ్వదని అన్నారు. మనదేశం ఇప్పటివరకు ఐటీ సర్వీసులనే అందివ్వగా, ఇకనుంచి ప్రొడక్టులను కూడా తీసుకొస్తుందని, ఇది కీలక పరిణామని ఆయన వివరించారు. ఐటీ సెక్టార్ఏటా 282 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని మంత్రి చెప్పారు.
బ్రౌజర్ డెవలప్ కోసం తాము చేసిన చాలెంజ్కు స్టార్టప్లు, విద్యాసంస్థలు, స్టూడెంట్లు, రీసెర్చర్ల నుంచి ఆశించిన స్పందన వచ్చిందని వెల్లడించారు. డేటా ప్రొటెక్షన్ చట్టానికి అనుగుణంగా బ్రౌజర్ను డెవెలప్ చేస్తామని, ఇది ఐఓఎస్, విండోస్, అండ్రాయిడ్ ఓఎస్లలో పనిచేస్తుందని అన్నారు.