కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిపోతుంది: బండి సంజయ్

 కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిపోతుంది: బండి సంజయ్

 కాంగ్రెస్ ప్రభుత్వంపై  కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు.   తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిపోతుందన్నారు. రాత్రిపూట యువతులను అరెస్టు చేయడానికి మీకు ఎంత ధైర్యం అని ప్రశ్నించారు.  నిరుద్యోగులను అమానవీయంగా లాగడం, కొట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ మొహబ్బత్ కి దుకాన్ అంటూ వాగ్దానం చేశాడు..కానీ  తెలంగాణ విద్వేషాల బజార్‌గా మారుతోందని మండిపడ్డారు. 

 జీవో29పై  కాంగ్రెస్  స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు మీకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే  పరీక్షను మళ్లీ నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు.   ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సింది పోయి..  బలవంతంగా గొంతు నొక్కుతోందన్నారు.  ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిరంచారు.

 తెలంగాణలో జీవో 29ని రద్దు చేయడంతో పాటు ఎగ్జామ్స్ వాయిదా వేయాలని అభ్యర్థులు  ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.  కోర్టుల్లో కేసులు కొలిక్కి వచ్చాకే  ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరో వైపు గ్రూప్ 1 ఎగ్జామ్ ను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించేందుకు సిద్దమైంది టీజీఎస్ పీఎస్ సీ. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది