పాతబస్తీ పక్కా హిందువులదే.. వాళ్లను తరిమి కొడ్తం: బండి సంజయ్

పాతబస్తీ పక్కా హిందువులదే.. వాళ్లను తరిమి కొడ్తం: బండి సంజయ్

పాత బస్తీలోని ప్రతీ గల్లిలో గణేష్ పండుగ గ్రాండ్ గా జరుగుతుందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఆయన..హిందూ సమాజానికి ఏదైనా సమస్య వస్తే  ముందుకు వచ్చేవారు హిందువులన్నారు. పాతబస్తీ పక్కా హిందువులదేనన్నారు. పాత బస్తీ వదిలి వెళ్ళిన హిందువులంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. 

ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చేవరకు ఊరుకోమన్నారు బండి సంజయ్.  ఓల్డ్ సిటీలో ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చిన వాళ్ళని తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు బండి సంజయ్.  హిందువుగా పుట్టినందుకు హిందూ ధర్మ రక్షణ కోసం సమయం కేటాయించాలన్నారు బండిసంజయ్.భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షిగా భారత్ మాతా కి జై అని నినదించాలన్నారు. 

ALSO READ | ఆ విషయంలో అసదుద్దీన్ ఓవైసీని మెచ్చుకోవచ్చు: రఘునందన్ రావు

గణేష్ ఉత్సవాల్లో భక్తి, దేశభక్తి కలసి ఉంటాయన్నారు. హిందూ సమాజం, దేశం పట్ల ఎవరైనా అనుచితంగా మాట్లాడితే... అందరం ఒక్క తాటి పైకి రావాలన్నారు.   హిందూ పండుగలు చేసుకోవాలంటే అన్ని పర్మిషన్లు కావాలి..కానీ వేరే పండుగలకు ఎలాంటి ఆంక్షలుండవన్నారు బండి సంజయ్.  భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పోరాటం చేస్తే ట్యాంక్ బండ్ పై నిమజ్జనం జరుగుతుందన్నారు. ప్రభుత్వం రంజాన్ పండుగకు రూ.3కోట్లు కేటాయించింది కానీ..హిందూ పండగలకు డబ్బులు కేటాయించలేదని విమర్శించారు. తాము ఇతర మతాలకు వ్యతిరేకం కాదన్నారు.