
హసన్ పర్తి/పరకాల, వెలుగు : బీఆర్ఎస్ ను కూకటివేళ్లతో పెకిలించాలని కేంద్ర సహకార శాఖ మంత్రి బి.ఎల్ వర్మ కోరారు. శుక్రవారం హసన్ పర్తి 66వ డివిజన్ లోని మహాలక్ష్మి హాల్లో బీజేపీ యువమోర్చా పార్లమెంట్ ప్రవాస్ యోజన యువమోర్చా సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడిందన్నారు. యూపీలో ఆ పార్టీ ఉనికే లేకుండా పోయిందన్నారు. పరకాల జీఎస్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన వరంగల్పార్లమెంటు ప్రవాస్ యోజన కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణలో 2014లో ఏర్పాటైన ప్రభుత్వంలో మహిళా మంత్రులు లేరని, మోడీ దేశానికి మహిళను రాష్ట్రపతిగా, రాష్ట్రానికి కూడా మహిళను గవర్నర్గా చేశాడన్నారు.
ఈసారి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ను అధికారంలోకి తేవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు డాక్టర్ పెసరు విజయచందర్రెడ్డి, మొలుగూరి భిక్షపతి, పగడాల కాళీప్రసాద్, గుజ్జ సత్యనారాయణ, పార్లమెంట్కన్వీనర్ కుమారస్వామి, పార్లమెంటు ప్రభారి డాక్టర్ మురళీధర్, మహిళా మోర్చ అధ్యక్షురాలు బండారి కళ్యాణి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్థినేని ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే రాజేశ్వర్రావు, నాగర్కర్నూల్ పార్లమెంట్ ప్రభారీ ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర కార్య వర్గ సభ్యులు చీటూరి అశోక్, రాష్ట్ర అధికార ప్రతి నిధి రాకేశ్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జ్ ఉమారాణి, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మల్లాడి తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.