ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్  క్షమాపణ చెప్పాలి :కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  

ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్  క్షమాపణ చెప్పాలి :కేంద్రమంత్రి కిషన్ రెడ్డి   
  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్  

న్యూఢిల్లీ, వెలుగు: ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ను నమ్మి ఢిల్లీ ప్రజలు అధికారం అప్పగించారని, కానీ ఆయన ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు కేజ్రీవాల్ 5 ప్రశ్నలు వేసిన నేపథ్యంలో ఆదివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కిషన్ రెడ్డి స్పందించారు. ఏమాత్రం నైతిక విలువలు లేని వ్యక్తి, మద్యం కుంభకోణంలో పట్టుబడి జైలుకు వెళ్లిన వ్యక్తి కేజ్రీవాల్ అని మండిపడ్డారు. ప్రజారోగ్యం విషయంలోనూ ప్రజలను దోచుకోవాలనుకునే వ్యక్తి కేజ్రీవాల్ అని ఫైర్ అయ్యారు.