ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలి : కిషన్ రెడ్డి

ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలి : కిషన్ రెడ్డి

ముషీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కావాడిగూడలోని సత్వ నెక్లెస్ ఫ్రైడ్ లో ఓపెన్ జిమ్ ను ఆయన ప్రారంభించారు. ప్రజల ఫిట్నెస్ కోసమే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పలు ఏరియాల్లో ఓపెన్ జిమ్స్ ప్రారంభిస్తున్నామని చెప్పారు. 

Also Read :- ప్రతి రెవెన్యూ విలేజ్కు ఒక అధికారి

ఇప్పటి వరకు 40కి పైగా ఏర్పాటు చేశామన్నారు. శారీరకంగా దృడత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించాలనే లక్ష్యంతోనే ఓపెన్ జిమ్స్ ని పెడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలన్నారు కిషన్ రెడ్డి.