పేదల ఇళ్లు కూల్చితే ఊరుకోం..కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

 పేదల ఇళ్లు కూల్చితే ఊరుకోం..కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: గతంలో కేసీఆర్​మూసీ బ్యూటీఫికేషన్​అంటూ మార్కింగ్​చేసి పదేళ్ల కిందట ప్లాన్​స్టార్ట్​చేశాడని,  ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే  వెనక్కి తగ్గడని, దాన్నే ఇప్పుడు రేవంత్​తలకెత్తుకున్నాడని  కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ఛీప్​ కిషన్​రెడ్డి ఆరోపించారు. ఇవాళ బీజేపీ స్టేట్​ఆఫీస్‎లో ప్రెస్​మీట్‎లో ఆయన మాట్లాడారు. ఏకపక్షంగా సీఎం రేవంత్​రెడ్డి పేదల ఇళ్లు కూల్చడం ఏ మాత్రం న్యాయం కాదన్నారు. ఈ కూల్చివేతల విధ్వంసాన్ని ఆపాలని ఇప్పటికే సీఎంకు లేఖ రాసిన్నట్లుగా ఆయన తెలిపారు.  ‘పేదల ఇళ్ళ కూల్చివేతలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆపేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచకుండా మూసీ సుందరీకరణ ఎవరికి కావాలి?. లక్షన్నర కోట్లల్లో సగం ఖర్చుతో  సిటీలో డ్రైనేజీ వ్యవస్థ సెట్ చేయండి.  డ్రైనేజీ, వరద నీటి డ్రైన్ల మీద శ్రద్ద పెట్టండి. మూసి సుందరీకరణ అంటే ముందు రిటైనింగ్ వాల్ కట్టండి.  

హైడ్రాను పుట్టించిన రేవంత్  రెడ్డికి  ధైర్యం ఉంటే ఫాం హౌజ్​లు , బడా బిల్డింగ్ లు  కట్టిన వాళ్ళవి  కూల్చండి.  ఓవైసీ ఫాతిమ కాలేజీ ఎందుకు కూల్చడం లేదు?  పెద్ద పెద్ద కంపెనీలను పిలిచి, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.  పేదల ఇళ్లను కూల్చితే  ఈ ప్రభుత్వం కూలిపోతుంది.  పేదల ఇళ్ళ కూల్చివేతలను సహించేది లేదు.  కూల్చివేతలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి.   మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న.  ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిని బహిష్కరించాలి.  ఇలా మాట్లాడటం కేసీఆర్ మొదలు పెట్టారు. దాన్ని కేటీఆర్ ముందుకు తీసుకెళ్లారు. సీఎం రేవంత్ కూడా కొనసాగిస్తున్నారు.  మార్పు రావాల్సి ఉంది.  కుటుంబాలు, మహిళల గురించి అనుచితంగా మాట్లాడటం కాంగ్రెస్, బీఆర్ఎస్​ పార్టీలకు అలవాటు అయిందని ’ అని కిషన్​ అన్నారు.