రీల్స్ పిచ్చి పీక్స్ అంటే ఇదే : రైలు పట్టాల మధ్య పడుకుని వీడియో.. అరెస్ట్ చేసి జైల్లో వేసిన పోలీసులు

రీల్స్ పిచ్చి పీక్స్ అంటే ఇదే : రైలు పట్టాల మధ్య పడుకుని వీడియో.. అరెస్ట్ చేసి జైల్లో వేసిన పోలీసులు

యూత్ రీల్స్ పిచ్చి పీక్స్ కు చేరింది.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.. ప్రాణాలనే ఫణంగా పెడుతున్నాడు.. రీల్స్ పిచ్చిలో ఏం చేస్తున్నామో కూడా సోయి లేకుండా పోయింది వీళ్లకు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోపై తీవ్రంగా స్పందించిన పోలీసులు, రైల్వే శాఖ.. ఆ కుర్రోడిని అరెస్ట్ చేసి జైల్లో వేసింది.. రైలు పట్టాలపై అత్యంత ప్రమాదకరంగా రీల్స్ షూట్ చేసిన ఘటన.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది

ఉత్తరప్రదేశ్‌లోని  కాన్పూర్- లక్నో మార్గంలో కుసుంభి స్టేషన్ సమీపంలో  ఓ యువకుడు రీల్స్ కోసం  రైలు ట్రాక్ మధ్యలో తన చేతులను ముందుకు చాచి, ఫోన్‌ను పట్టుకుని ఉన్నాడు. ఆ సమయంలో వేగంగా వస్తున్న రైలు అతడిపై నుంచి వెళ్లింది. తర్వాత అతను సేఫ్ లేచి మామూలుగా నిలబడ్డాడు.అతడికి ఏమి కాలేదు. ఇది ఆ వీడియోలో కనిపిస్తోంది.

►ALSO READ | బెంగళూరులాంటి పెద్ద సిటీలో మహిళలపై లైంగిక వేధింపులు కామన్: హోంమంత్రి పరమేశ్వర

అయితే  ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్న రకాలుగా కామెంట్స్  చేస్తున్నారు కొందరు ఆ వీడియోను ఎడిట్ చేశారని..వీడియోలో కట్స్ ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియో ఎడిట్ చేసిందా? లేక నిజమైందా  తెల్వదు. మొత్తానికి రైల్వే పోలీసులు ఈ వీడియోలోఉన్న యువకుడు  రంజిత్ చౌరాసియా( 22 ఏళ్ల)గా గుర్తించి అరెస్ట్ చేశారు. 

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అతని మీదుగా వెళుతుండగా అతను రైల్వే పట్టాలపై నిలబడి ఉన్నాడని.. అతనికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు.  వీడియోను  ఫోరెన్సిక్  ల్యాబ్ కు  పంపిస్తే ఆ వీడియో క్లిప్ ఎడిట్ చేయబడిందో లేదో తెలుస్తుందని రైల్వే అధికారి అరవింద్ పాండే తెలిపారు. ఈ కేసు గురించి ఇంకా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

The name of this reelputra is Ranjit Chaurasia. He lay down on the track and let the whole train pass over him and Recorded a Reel of it, Now the reelputra has been arrested and is going to jail, Unnao UP
pic.twitter.com/NRO7VLAEtj

— Ghar Ke Kalesh (@gharkekalesh) April 8, 2025