బీఆర్ఎస్​ హయాంలో 15 కిలోల వరకు తరుగు పెట్టారు

బీఆర్ఎస్​ హయాంలో 15 కిలోల వరకు తరుగు పెట్టారు
  • పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ హయాంలో గింజ కూడా కోత లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని పెద్దపల్లి కాంగ్రెస్ ​ఎమ్మెల్యే విజయరమణా రావు అన్నారు. బీఆర్ఎస్​ హయాంలో క్వింటాల్​కు 5 కిలోల నుంచి 15 కిలోల వరకు తరుగు పెట్టారని విమర్శించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. పంటల బీమా పథకాన్ని కూడా బీఆర్ఎస్ ​సర్కార్ ఇవ్వలేదని అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వకుండా రైతులను మోసం చేసిందని మండిపడ్డారు.

 నాడు వైఎస్​రాజశేఖర్​ రెడ్డి హయాంలోనే పంట పరిహారాలు అందాయని వివరించారు. గత బీఆర్ఎస్ ​సర్కార్ ​రైతు రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేదన్నారు. ఎన్నికల ముందు హడావుడిగా చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోలేదని ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ ​సర్కారు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నదని తెలిపారు.