చిన్న పట్టణాల నుంచి అమలు
రూ.35 వేల కోట్ల ఖర్చు
కరోనాతో రోడ్డు న పడ్డారు
న్యూఢిల్లీ: గ్రామాల్లో అమలవుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద జాబ్స్ ప్రొగ్రామ్ను సిటీలకు కూడా విస్తరించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. కరోనా లాక్డౌన్తో సిటీల్లో నిరుద్యోగం పెరగడంతో, ఈ ఫ్లాగ్షిప్ ప్రొగ్రామ్ను నగరాల్లో అమలు చేయాలనుకుంటోంది. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఈ ప్రొగ్రామ్ను తొలుత చిన్న పట్టణాల్లో అమలు చేస్తామని హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు. ఈ ప్రొగ్రామ్కు అయ్యే ఖర్చు తొలుత రూ.35,000 కోట్లుగా ఉంటుందని చెప్పారు. గతేడాది నుంచే ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తోందని తెలిపారు. కరోనా మహమ్మారి ఈ ఐడియాను మరింత ముందుకు తీసుకెళ్లిందని పేర్కొన్నారు. రూరల్ జాబ్స్ ప్రొగ్రామ్(ఎన్ఆర్ఈజీఎస్) కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం ఇప్పటికే రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఏడాదిలో వంద రోజుల పనిదినాలను ప్రభుత్వం కల్పిస్తోంది. రోజుకు కనీస జీతం రూ.202ను ప్రభుత్వం ఇస్తోంది. కరోనా వైరస్తో అర్బన్ ప్రాంతాల్లో ప్రభావితమైన ప్రజల కోసం ఈ ప్రొగ్రామ్ను సిటీలకు కూడా కేంద్రం తెస్తోంది. కరోనాతో ఆసియాలోనే మూడో పెద్ద ఎకానమీ అయిన ఇండియా ప్రమాదంలో పడింది. చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. చిన్న పట్టణాల నుంచి ఈ ఐడియా తొలుత ప్రారంభమవుతుందని, పెద్ద సిటీ ప్రాజెక్ట్లకు నైపుణ్యం కలవారు అవసరమని కుమార్ తెలిపారు. రూరల్ ప్రొగ్రామ్లో లోకల్గా జరిగే రోడ్డు బిల్డింగ్, అటవీ ప్రాంతాలు అభివృద్ధి వంటి పబ్లిక్ వర్క్ ప్రాజెక్ట్లుంటాయి. ప్రస్తుతం ఈ రూరల్ ప్రొగ్రామ్ కింద 27 కోట్ల మందికి పైగా కవర్ అవుతున్నారు. లాక్డౌన్తో సిటీల నుంచి ఊర్లకు తిరిగొచ్చిన వలస కూలీలకు ఈ ప్రొగ్రామ్ ద్వారా ఉపాధిని అందించారు. అర్బన్ ప్రాంతాల్లో చాలా మందిని కరోనా పేదరికంలోకి నెట్టేసిందని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అనాలసిస్లో వెల్లడైంది. ఏప్రిల్ నెలలో సుమారు 12.1 కోట్ల మందికి పైగా ప్రజలు ఉపాధిని కోల్పోయారు. అన్ఎంప్లాయీమెంట్ రేటు కూడా ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలకు అంటే 23 శాతానికి పెరిగినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించింది. ఎకానమీ తిరిగి ప్రారంభం కావడంతో నిరుద్యోగ రేటు కాస్త తగ్గింది. ప్రస్తుతం ఇది 8.35 శాతానికి దిగొచ్చింది. అర్బన్ వర్కర్లు పేదరికంలో పడకుండా నిరోధించేందుకు, జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పనిచేయాల్సి ఉందని ఎక్స్పర్ట్లు చెప్పారు.‘ సిటీ ఆఫ్ డ్రీమ్స్ నో మోర్: ది ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ 19 ఆన్ అర్బన్ వర్కర్స్ ఇన్ ఇండియా ’ పేరుతో రిపోర్ట్ను షానియా భలోటియా, స్వాతి ధింగ్రా, జొల్లా కొండిరోలి రూపొందించారు.
పెరిగిన నిరుద్యోగం
మరోవైపు ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉద్యోగాలు పడిపోవడంతో, అర్బన్ అన్ఎంప్లాయిమెంట్ రేటు ఆగస్ట్ నెలలో 9.83 శాతంగా నమోదైంది. ఇది జూలైలో 9.15 శాతంగా ఉన్నట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ విడుదల చేసే నెలవారీ అన్ఎంప్లాయిమెంట్ డేటాలో వెల్లడైంది. అంటే అర్బన్ ఏరియాల్లో ప్రతి పది మందిలో ఒకరు ఉద్యోగం లేకుండా ఉంటున్నారని తెలిసింది. మొత్తంగా ఆగస్ట్ నెలలో అన్ఎంప్లాయిమెంట్ రేటు 8.35 శాతానికి పెరిగింది. జూలైలో ఇది 7.43 శాతంగా ఉంది. రూరల్ అన్ఎంప్లాయిమెంట్ రేటు జూలై నెలలో 6.66 శాతం ఉంటే అది ఆగస్ట్ నాటికి 7.65 శాతానికి పెరిగింది. ఎంప్లాయిమెంట్ పరంగా బాగా దెబ్బతిన్న రాష్ట్రం హర్యానా. ఈ రాష్ట్రంలో ఆగస్ట్లో అన్ఎంప్లాయిమెంట్ రేటు 33.5 శాతానికి పెరిగింది. ఆ తర్వాత త్రిపురలో 27.9 శాతంగా ఉంది. ఈ డేటా చాలా ఆందోళనకరంగా ఉందని ఎకనమిస్ట్లు, ఎక్స్పర్ట్లు అంటున్నారు. కొనసాగుతోన్న ఉద్యోగాల కోత, వీక్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఎంప్లాయిమెంట్ సంక్షోభంలోకి నెడతాయని భావిస్తున్నారు.
For More News..