ఉపాసన పెద్ద మనసు... రేణు దేశాయ్ కి సాయం

ఉపాసన పెద్ద మనసు... రేణు దేశాయ్ కి సాయం

మూగ జీవాల సంరక్షణ కోసం సినీ సెలెబ్రెటీలు ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలో కొందరు పలు ఎన్.జి.ఓ సంస్థలకి విరాళాలు ఇవ్వడం, అలాగే పెట్ కేర్ సంస్థలు స్థాపించడం వంటివి చేస్తుంటారు. అయితే ఒకప్పటి హీరోయిన్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మూగ జీవాల సంరక్షణ కోసం ఇటీవలే శ్రీ ఆద్య యానిమల్‌ షెల్టర్‌ అనే సంస్థను ప్రారంభించారు. అయితే ఈ సంస్థకి ఎవరైనా విరాళాలు ఇవ్వచ్చని తెలిపింది. 

దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తమ పెంపుడు కుక్క రైమీ పేరు మీదుగా శ్రీ ఆద్య యానిమల్‌ షెల్టర్‌ సంస్థకి పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చింది. ఈ విరాళంతో రేణు దేశాయ్ మూగ జీవాల కోసం అత్యవసర పరిస్తితులలో ఉపయోగించడానికి అంబులెన్సు ని కొనగోలు చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని రేణు దేశాయ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా పెళ్ళయిన తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమైంది నటి రేణు దేశాయ్.  విడాకుల తర్వాత పిల్లల భాద్యతలు చక్కబెట్టే పనిలో పడింది. అయితే గత ఏడాది మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.