
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు UPSC అధికారిక వెబ్ సైట్ upsc.gov.in లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 111 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మే 1, 2025 లాస్ట్ డేట్.
ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు..
- సిస్టమ్ అనలిస్ట్: 1 పోస్ట్
- డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్: 18 పోస్టులు
- అసిస్టెంట్ ఇంజనీర్: 9 పోస్టులు
- జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్: 13 పోస్టులు
- అసిస్టెంట్ లెజిస్లేటివ్ కౌన్సెల్: 4 పోస్టులు
- అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్: 66 పోస్టులు
అర్హతలు
పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇక్కడ అందుబాటులో వివరణాత్మక నోటిఫికేషన్ ద్వారా వారి విద్యార్హతలు,వయోపరిమితిని తనిఖీ చేయవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలంటే..
అభ్యర్థులు ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ (ORA) వెబ్సైట్ https://upsconline.gov.in/ora/లో ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఇంటర్వ్యూ ద్వారా గానీ, రిక్రూట్మెంట్ టెస్ట్ (RT) ,ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థి ఇంటర్వ్యూ దశలో వారి సంబంధిత విభాగంలో కనీస స్థాయి అర్హత సాధించవలసి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో UR/EWS- అభ్యర్థులు 50 మార్కులు, OBC- 45 మార్కులు, SC/ST/PwBD-40 మార్కులు సాధించాలి. ఇంటర్వ్యూ మొత్తం100 మార్కులకు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు..
అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ.25లు. వికలాంగ అభ్యర్థులు/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఉండదు. SBI ఏదైనా బ్రాంచ్లో నగదు ద్వారా లేదా ఏదైనా బ్యాంకు నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ, వీసా/మాస్టర్/రూపే/క్రెడిట్/డెబిట్ కార్డ్/UPI ద్వారా గానీ ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు UPSC అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.