పౌరసత్వంపై ట్రంప్ కీలక ప్రకటన.. వాళ్లందరికి గోల్డ్ కార్డ్ వీసా

 పౌరసత్వంపై ట్రంప్ కీలక ప్రకటన.. వాళ్లందరికి గోల్డ్ కార్డ్ వీసా

వరుస సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు  మరో కీలక ప్రకటన చేశారు. అమెరికాలో పెట్టుబడులు  పెట్టే వారి కోసం గోల్డ్ కార్డ్ వీసాలను తీసుకురానున్నట్లు తెలిపారు. అమెరికాలో  5 మిలియన్  డాలర్లు( దాదాపు 44కోట్లు) పెట్టుబడి పెట్టేవారికి ఈ గోల్డ్  కార్డ్  లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు ట్రంప్.

  వీసా పొందే వ్యక్తులు అమెరికాలో పెట్టుబడులు పెట్టడంతోపాటు ప్రభుత్వానికి పన్నులు చెల్లించే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. ఈ కార్డు కొనుగోలు చేయడం ద్వారా వివిధ దేశాల్లోని సంపన్నులు తమ దేశంలోకి వస్తారని ఆయన తెలిపారు. అమెరికాలో ఐదు మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం రూ. 44 కోట్లు) పెట్టుబడి దారులకు ఈ గోల్డ్ కార్డు వీసాలను మంజూరు చేస్తామని చెప్పారు. అమెరికాలో పెట్టుబడి దారుల కోసం ప్రవేశపెట్టిన ఈబీ–5 వీసా పాలసీని మార్చనున్నట్టు తెలిపారు

గోల్డ్ వీసా సక్సెస్ అవుతుందని తాము భావిస్తున్నామన్నారు ట్రంప్. ప్రస్తుతం EB-5 వీసాల జారీపై ఏడాదికి కొంత పరిమితి ఉండగా.. గోల్డ్  కార్డ్  లపై అలాంటిదేమీ ఉండదని స్పష్టం చేశారు. ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు తమ ప్రభుత్వం కోటి గోల్డ్  కార్డ్ లను ఇవ్వనున్నట్లు చెప్పారు. మరో రెండు వారాల్లో EB-5 వీసాలను ట్రంప్  గోల్డ్  కార్డ్  లతో భర్తీ చేయనున్నారని చెప్పారు వాణిజ్య మంత్రి హోవర్డ్  లట్నిక్ . ఇది కూడా ఒకరకంగా శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డ్  లాంటిదే అన్నారు.