న్యూఢిల్లీ: సన్ ఫార్మా దాద్రా ప్లాంటులో డ్రగ్స్ తయారీకి ఉపయోగించే పరికరాలను తగినంతగా శుభ్రపరచడంలో, సరిగ్గా నిర్వహించడంలో విఫలమైందని పేర్కొంటూ యూఎస్ఎఫ్డీఏ వార్నింగ్ వచ్చింది. ఈమేరకు జూన్ 18న కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ షాంఘ్వీకి వార్నింగ్ లెటర్ పంపించింది. యూఎస్ హెల్త్ రెగ్యులేటర్ 2023 డిసెంబర్ 4-–15 మధ్య దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంలోని ప్లాంట్ను తనిఖీ చేశాక ఈ నిర్ణయం తీసుకుంది.
కాలుష్యాన్ని నివారించడానికి పరికరాలను, పాత్రలను శుభ్రపరచడం, నిర్వహించడంలో సంస్థ విఫలమైందని పేర్కొంది. ఫినిష్డ్ఫార్మాస్యూటికల్స్కు సంబంధించిన కరెంట్ గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (సీజీఎంపీ) నిబంధనలను పాటించడం లేదని విమర్శించింది.