అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​కు..పూర్తి మార్కెట్ ​యాక్సెస్​ ?

అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​కు..పూర్తి మార్కెట్ ​యాక్సెస్​ ?

న్యూఢిల్లీ: ఈ–కామర్స్​ కంపెనీలు అమెజాన్, వాల్‌‌‌‌మార్ట్  ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌లకు 125 బిలియన్ డాలర్ల విలువైన ఈ–-కామర్స్ మార్కెట్‌‌‌‌కు పూర్తి యాక్సెస్ ఇవ్వాలని అమెరికా భారతదేశంపై ఒత్తిడి తెస్తోందని తెలుస్తోంది. వాణిజ్య ఒప్పందం కోసం రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది.  ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్​ ప్రకారం, ఈ–కామర్స్ మార్కెట్‌‌‌‌లో తమ కంపెనీలకు అన్ని రకాల పర్మిషన్లను,  సమాన అవకాశాలను ఇవ్వాలని అమెరికా కోరుకుంటోంది.

ప్రస్తుత రూల్స్​ప్రకారం.. అమెజాన్,  ఫ్లిప్‌‌‌‌కార్ట్ వంటి విదేశీ యాజమాన్యంలోని ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లను మార్కెట్‌‌‌‌ప్లేస్‌‌‌‌లుగా మాత్రమే పనిచేయాలి. సొంతగా ఉత్పత్తులను అమ్మకూడదు. థర్డ్-పార్టీ సెల్లర్లకు, కొనుగోలుదారులకు మధ్య అనుసంధానం చేయాలి.   భారతదేశం అమెరికా డిమాండ్లకు తలొగ్గితే అమెజాన్,  ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌లు.. రిలయన్స్ రిటైల్, టాటా న్యూ వంటి భారతీయ కంపెనీలతో నేరుగా పోటీపడవచ్చు.