హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎగువ నుంచి ఉస్మాన్సాగర్ జలాశయనికి వరద కొనసాగుతోంది. అధికారులు ఇప్పటివరకు ఒక గేట్ ఎత్తి మూసీలోకి నీటిని వదులుతుండగా, శుక్రవారం మరో రెండు గేట్లను ఓపెన్చేశారు. మొత్తం మూడు గేట్ల నుంచి 484 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
అటు హిమాయత్ సాగర్ జలాశయం ఒక గేటు ద్వారా 348 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ కు 500 క్యూసెక్కులు, ఉస్మాన్ సాగర్ కు 425 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది.