జంట జలాశయాల గేట్లు ఓపెన్​

జంట జలాశయాల గేట్లు ఓపెన్​

హైదరాబాద్ సిటీ, వెలుగు:సిటీ జంట జలాశయాలకు భారీగా వరద కొనసాగుతోంది. పదేండ్ల తర్వాత ఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నట్లు మెట్రో వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంట‌లకు హిమాయత్‌సాగ‌ర్ ఒక గేటు నుంచి 330 క్యూసెక్కులు, ఉస్మాన్ సాగ‌ర్ రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 226 క్యూసెక్కుల నీటిని మూసీ న‌దిలోకి వ‌దులుతున్నారు.

దీంతో మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెట్రోవాటర్​బోర్డు మేనేజింగ్​ డైరెక్టర్​అశోక్​రెడ్డి సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్, జీహెచ్​ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. 

రిజర్వాయర్                                    హిమాయత్ సాగర్​     ఉస్మాన్ సాగర్ (గండిపేట్) 

పూర్తి స్థాయి నీటి మట్టం              1763.50 అడుగులు      1790.00 అడుగులు
ప్రస్తుతం                                      1761.20 అడుగులు       1788.25 అడుగులు
ఇన్​ఫ్లో                                      1200 క్యూసెక్కులు      1600 క్యూసెక్కులు
అవుట్​ ఫ్లో                                330 క్యూసెక్కులు              226 క్యూసెక్కులు