Ram Pothineni: మహేష్ బాబుతో సినిమా చేయనున్న రామ్.. త్వరలోనే అధికారిక ప్రకటన

Ram Pothineni: మహేష్ బాబుతో సినిమా చేయనున్న రామ్.. త్వరలోనే అధికారిక ప్రకటన

స్కంద(Skanda) సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది ఉస్తాద్ హీరో రామ్(Ram) ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri Jagannadh) తో డబుల్ ఇస్మార్ట్(Double Ismart) సినిమా చేస్తన్నారు. బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా  ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా.. రామ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. డబుల్ ఇస్మార్ట్ సినిమా తరువాత రామ్ చేయబోయే సినిమాపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని రామ్ తరువాతి సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్నాడని చెప్తుండగా.. మరికొన్నేమో దర్శకుడు మహేష్ బాబుతో  చేస్తున్నాడని వస్తున్నాయి. ఇందులో త్రివిక్రమ్ సినిమాపై పెద్దగా క్లారిటీ లేదు కానీ, మహేష్ బాబుతో చేయబోయే ప్రాజెక్టు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. 

మహేష్ బాబు గతంలో నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేశాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిచిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ దర్శకుడు రామ్ కోసం లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేశాడట. ఇటీవలే ఈ కథను రామ్ కి వినిపించగా ఆయన కూడా వెంటనే ఒకే చెప్పేశాడని సమాచారం. స్రవంతి మూవీస్ నిర్మించనున్న ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలోనే రానుందట. మరి.. ఈ సినిమాతో రామ్ ఎలాంటి విజయాన్ని అందుకోనున్నాడో చూడాలి.